Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : గ్రాండ్స్లామ్ టోర్నీల్లో అత్యధిక నగదు బహుమతి అందిస్తోన్న ఫ్రెంచ్ ఓపెన్, అంతరాన్ని తగ్గించేందుకు ఓ అడుగు ముందుకేసింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ విజేతల నగదు బహుమానాన్ని 8 శాతం పెంచింది. ఈ మేరకు రొలాండ్ గారోస్ నిర్వాహకులు గురువారం వెల్లడించారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మహిళలు, పురుషుల సింగిల్స్ విజేతలు రూ. 18 కోట్లు అందుకోనున్నారు. యు.ఎస్ ఓపెన్ విజేతలు రూ. 26 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంటున్న విషయం తెలిసిందే. మట్టికోర్టు గ్రాండ్స్లామ్ పోరు మే 26న ఆరంభమై, జూన్ 9న మెన్స్ సింగిల్స్ ఫైనల్స్తో ముగియనున్నది.