Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెషల్ సమ్మర్ ఒలింపిక్స్లో 368 పతకాలు
అబుదాబి (యుఏఈ) : స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్లో భారత్ అదరగొట్టింది. 368 పతకాలు కొల్లగొట్టిన స్పెషల్ అథ్లెట్లు టీమ్ ఇండియా సత్తా చాటారు. ప్రత్యేక ఒలింపిక్స్ అబుదాబిలో మార్చి 14-21 వరకు జరిగాయి. 284 మంది అథ్లెట్లతో యు.ఏ.ఈ వెళ్లిన భారత్.. 85 స్వర్ణాలు సహా 154 రజతాలు, 129 కాంస్య పతకాలు సాధించింది. పవర్ లిఫ్టింగ్లో 20 స్వర్ణాలు, 33 రజతాలు, 43 కాంస్యాలు దక్కగా.. రోలర్ స్కేటింగ్లో 13 స్వర్ణాలు, 20 రజతాలు, 16 కాంస్యాలతో 49 పతకాలు వచ్చాయి. సైక్లింగ్లో 11 స్వర్ణాలు, 14 రజతాలు, 20 కాంస్య పతకాలు సొంతమయ్యాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్లో 5 స్వర్ణాలు, 24 రజతాలు, 10 కాంస్యాలతో 39 మెడల్స్ అందుకున్నారు. మేధోపరమైన, శారీరక వైకల్య అథ్లెట్లకు స్పెషల్ ఒలింపిక్స్ నిర్వహిస్తారు. స్పెషల్ ఒలింపిక్స్ చరిత్రలో 368 పతకాలు సాధించటం భారత్కు ఇదే ప్రథమం.