Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో నేపాల్పై 3-1తో విజయం
- శాఫ్ టైటిల్ నిలుపుకున్న భారత్
బిరాట్నగర్ (నేపాల్) : అమ్మాయిలు ఐదేశారు. దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ మహిళల చాంపియన్షిప్లో ఐదో సారి విజేతగా నిలిచారు. శాఫ్లో వరుసగా 23 మ్యాచుల్లో అజేయ రికార్డును కొనసాగించిన టీమ్ ఇండియా శుక్రవారం ఇక్కడి షాహిద్ రంగశాల స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో ఆతిథ్య నేపాల్పై ఘన విజయం సాధించింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన అమ్మాయిలు, అదే జోరు ఫైనల్లోనూ చూపించారు. విజిల్ మోగిన తొలి నిమిషం నుంచీ నేపాల్పై దాడి చేసిన టీమ్ ఇండియా.. ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించింది. సొంత అభిమానుల నడుమ నేపాల్ సైతం గట్టిగానే పోరాడింది. భారత ఎటాక్కు దీటుగా బదులిచ్చింది. కానీ నేపాల్ ఒక్క గోల్కే పరిమితం కాగా, టీమ్ ఇండియా మూడు గోల్స్తో కప్పు కొల్లగొట్టింది. భారత్ తరఫున గ్రీస్, దాలిమా చిబ్బార్, అంజు తమంగ్లు గోల్స్ నమోదు చేశారు. వెనుకంజలో నిలిచినా ఆఖరు వరకూ స్కోరు సమం చేసేందుకు నేపాల్ గట్టి ప్రయత్నాలే చేసింది. కానీ బలమైన భారత డిఫెన్స్ నేపాల్ ప్రయత్నాలను వమ్ము చేసింది.