Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ముంబయి ఇండియన్స్కు మరో ఎదురుదెబ్బ. వరుసగా ఆ జట్టుకు రెండో విదేశీ సీమర్ సేవలు కోల్పోయింది. శ్రీలంక జాతీయ జట్టు కోసం లసిత్ మలింగ ముంబయి ఇండియన్స్ తొలి ఆరు మ్యాచుల్లో ఆడటం లేదు. తాజాగా కాలి మడమ వాపుతో బాధపడుతున్న న్యూజిలాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే సైతం ఐపీఎల్ సీజన్ 12కు దూరమయ్యాడు. మిల్నే స్థానంలో వెస్టిండీస్ సీమర్ అల్జారీ జొసెఫ్ను తీసుకునేందుకు ముంబయి ఆసక్తి చూపుతోంది. మిల్నేను ముంబయి వేలంలో రూ. 75 లక్షలకు దక్కించుకున్నది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మరో ఆటగాడిని ఎంచుకుంటే, అదే ధరను తీసుకోవాల్సి ఉంటుంది. ముంబయి ఇండియన్స్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మిచెల్ మెక్లనగెన్, బెన్ కటింగ్ రూపంలో ముంబయి ఇండియన్స్కు ఇప్పుడు ఇద్దరు ఆస్ట్రేలియా సీమర్లు అందుబాటులో ఉన్నారు.