Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనీసేన హ్యాట్రిక్ విజయం
- రాయల్స్కు మూడో ఓటమి
చెన్నై : చెపాక్లో తీన్మార్. ఆతిథ్య జట్టు సూపర్కింగ్స్ విజయాల హ్యాట్రిక్ సాధించగా, రాజస్థాన్ రాయల్స్ ఓటముల్లో హ్యాట్రిక్ మూటగట్టుకున్నది. ఆఖరు ఓవర్ ఉత్కంఠకు దారితీసిన మ్యాచ్లో రాయల్స్ను కట్టడి చేసిన చెన్నై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ ఎం.ఎస్ ధోని (75 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) చెపాక్లో అత్యధిక స్కోరు సాధించిన వేళ చెన్నై తొలుత 175 పరుగులు చేసింది. 27/3తో రాయుడు (1), వాట్సన్ (13), కేదార్ జాదవ్ (13) వికెట్లు కోల్పోయిన చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ సురేశ్ రైనా (36), బ్రావో (27) జతగా ధోని స్పెషల్ ఇన్నింగ్స్ చెన్నైకి భారీ స్కోరు అందించింది. ధవల్ కులకర్ణి వేసిన ఆఖరి ఓవర్లో ధోని ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఛేదనలో 94/5తో కష్టాల్లో పడిన రాజస్థాన్ బెన్ స్టోక్స్ (46), జోఫ్రా ఆర్చర్ (24) ధనాధన్తో రేసులోకి వచ్చింది. చివరి ఆరు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో బెన్ స్టోక్స్, శ్రేయాష్ (0)లను అవుట్ చేసిన బ్రావో.. మ్యాచ్ను చెన్నైవైపు తిప్పాడు. చివరి ఓవర్లో రాయల్స్ మూడు పరుగులే చేయగల్గింది. రాజస్థాన్ను 167 పరుగులకే పరిమితం చేసిన చెన్నై ఐపీఎల్12లో మూడో విజయం సాధించింది. నాలుగేసి ఫోర్లు, సిక్సర్లతో మెరిసిన మహి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. నేడు జరిగే మ్యాచ్లో పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.