Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ 166/9
చండిగఢ్ : గేల్ లేని మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ పవర్ తేలిపోయింది. ఆశ్చర్యకర నిర్ణయాలు పంజాబ్కు కలిసిరాకపోగా, ఢిల్లీ బౌలర్ల మెరుపులతో కింగ్స్ ఎలెవన్ 166 పరుగులకే పరిమితం అయ్యింది. సొంతగడ్డపై టాస్ ఓడిన పంజాబ్ తొలుత బ్యాటింగ్కు వచ్చింది. ఢిల్లీ పేసర్లు కగిసో రబాడ (2/32), క్రిస్ మోరిస్ (3/30) సహా నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానె (2/27) పంజాబ్ బ్యాటింగ్ లైనప్ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (15), శామ్ కురన్ (20)లు పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయారు. మయాంక్ అగర్వాల్ (6) రనౌట్తో పంజాబ్ ఆరంభ ఓవర్లలో వేగంగా పరుగులు చేసే అవకాశం కోల్పోయింది. గేల్ ఉన్న వేళ పవర్ప్లేలో భారీగా పరుగులు పిండుకున్న పంజాబ్, అతడు లేకపోవటంతో స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ సర్ఫరాజ్ ఖాన్ (39, 29 బంతుల్లో 6 ఫోర్లు), డెవిడ్ మిల్లర్ (43, 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), మన్దీప్ సింగ్ (29 నాటౌట్) రాణించటంతో 166 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. రబాడ వేసిన ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులను వరుసగా 4, 6గా బాదిన మన్దీప్ ఊరటనిచ్చే ముగింపునిచ్చాడు. హర్దుస్ (1), అశ్విన్ (3), మురుగన్ అశ్విన్ (1), మహ్మద్ షమి (1)లు ఆఖర్లో వెన్వెంటనే వికెట్లు కోల్పోయారు. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (0)ను కోల్పోయింది. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే పృథ్వీ క్యాచౌటయ్యాడు.