Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంత్ ఆశలు ఆవిరి
ముంబయి : ప్రపంచకప్ జట్టులో ఖాయం అనుకున్న ఆటగాళ్లలో తెలుగు కుర్రాడు అంబటి రాయుడు ఒకరు. ఆస్ట్రేలియాతో సిరీస్కు కార్తీక్ను కాదని రిషబ్ పంత్ను ఎంచుకునేసరికి లండన్ టికెట్ ఢిల్లీ కుర్రాడికి ఖాయమైందనే అనుకున్నాం. కానీ సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ సమీకరణాలు మరోలా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ అవకాశాలు దక్కినా, అంబటి రాయుడు నిలకడ సాధించలేదు. ఆసీస్, కివీస్ టూర్ సహా స్వదేశంలో కంగారూలపై విఫలమయ్యాడు. ఫలితంగా, నం.4 రేసులో ముందున్నా అసలు ప్రపంచకప్ జట్టులోకే ఎంపిక కాలేదు. ప్రపంచకప్ జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు ఉండీ, ఎంపిక కాని ఆటగాడు రిషబ్ పంత్. దినేశ్ కార్తీక్ అతడి స్థానాని ఎగరేసుకుపోయాడు. ఢిల్లీలో ఆస్ట్రేలియాతో చివరి వన్డే ఛేదనలో వైఫల్యం సహా ఐపీఎల్లో వరుసగా ఛేదనలో విఫలం కావటం పంత్ అవకాశాలను దెబ్బకొట్టింది.
ఎమ్మెస్కే ఏమన్నాడంటే.. :
'ఒత్తిడిలో మ్యాచులను ముగించిన దినేశ్ కార్తీక్ను ఎన్నో సార్లు చూశాం. అదే అతడికి బలమైంది. కార్తీక్, పంత్ ఎవరైనా.. ధోని గాయపడితేనే తుది జట్టులోకి వచ్చేది. ఆ మ్యాచ్ నాకౌట్ లేదా కీలకమైతే అప్పుడు వికెట్ కీపింగ్ ప్రధానమవుతోంది. వికెట్ కీపింగ్ నైపుణ్యంలో పంత్ మెప్పించలేదు. ఈ ఒక్క కారణంతో అతడు ప్రపంచకప్ జట్టుకు దూరమయ్యాడు. నం.4 స్థానం కోసం ఎంతో మందిని ప్రయత్నించాం. చివరగా విజరు శంకర్ వద్ద ఆగిపోయాం. ప్రపంచకప్లో కనీసం లీగ్ దశలో విజరు శంకర్ నం.4గా ఆడతాడు. రాహుల్ మూడో ఓపెనర్గానే ఎంపికయ్యాడు. కార్తీక్ రెండో వికెట్ కీపర్. మిడిల్ ఆర్డర్లో నం.4కు న్యాయం జరుగకపోతేనే రాహుల్కు ఆ అవకాశం వస్తుంది' అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరితో కలిసి ప్రసాద్ వరల్డ్కప్ జట్టును ప్రకటించాడు.