Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన మోయిన్ అలీ
- బెంగళూర్ 171/7
ముంబయి : ఏబీ డివిలియర్స్ (75, 51 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), మోయిన్ అలీ (50, 32 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లు) మెరుపులతో ముంబయి ఇండియన్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మెరుగైన స్కోరు సాధించింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి (8) విఫలమైనా.. ఆఖరు వరకూ క్రీజులో నిలిచిన డివిలియర్స్ ఆర్సీబీకి పోరాడగలిగే స్కోరు అందించాడు. ఓపెనర్ పార్దీవ్ పటేల్ (28) రాణించాడు. ముంబయి సీమర్ లసిత్ మలింగ (4/31) నాలుగు వికెట్లతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఛేదనలో 10.3 ఓవర్లలో ముంబయి 104/3తో కొనసాగుతోంది.
ఏబీ, అలీ మెరుపులు : టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ మంచు ప్రభావం దృష్ట్యా ఛేదనకు మొగ్గుచూపింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (8) ఓ ఫోర్తో మెరిసినా, మూడో ఓవర్లోనే అతడు వికెట్ కోల్పోయాడు. దీంతో ఆరంభంలోనే బెంగళూర్ దూకుడుకు బ్రేక్ పడింది. మరో ఓపెనర్ పార్దీవ్ పటేల్ (28, 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఏబీ డివిలియర్స్ (75) ఇన్నింగ్స్ చక్కదిద్డాడు. పటేల్ నిష్క్రమించినా.. ఏబీకి మోయిన్ అలీ (50) రూపంలో దూకుడైన భాగస్వామి లభించాడు. అలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఐదు సిక్సర్లు, ఓ ఫోర్తో అర్ధ సెంచరీ సాధించాడు. నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో ఏబీ సైతం మరో ఫిఫ్టీ అందుకున్నాడు. అలీ అవుటైన తర్వాత మరో ఎండ్లో పరుగుల వేట కరువైంది. స్టోయినిస్ (0), అక్షదీప్ (2), పవన్ నేగి (0) విఫలమయ్యారు. ఆఖరు ఓవర్లో డివిలియర్స్ సైతం వికెట్ కోల్పోయాడు. ఏబీ, అలీ పోరాటంతో బెంగళూర్ 171 పరుగులు చేసింది.