Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్ 2018 ఫైనల్స్ రీ మ్యాచ్!. ఐపీఎల్11 ఫైనలిస్ట్లు చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తొలిసారి తలపడనున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచులోనే ఢకొీట్టాల్సిన ఫైనలిస్ట్లు.. షెడ్యూల్ మార్పులతో ప్రథమార్థం ముగింపులో ముఖాముఖికి సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై, రన్నరప్ హైదరాబాద్లు తాజా మ్యాచ్కు ముందు భిన్నమైన స్థితిలో కొనసాగుతున్నాయి. ఎనిమిది మ్యాచుల్లో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్తోన్న జట్టు చెన్నై కాగా, ఏడు మ్యాచుల్లో నాలుగు ఓటములతో సమస్యలెదుర్కొంటున్న జట్టు సన్రైజర్స్. సొంతగడ్డపై ఆడుతున్నా, చెన్నై సూపర్ కింగ్స్పై హైదరాబాద్ మానసికంగా పైచేయి సాధించలేదు. వెటరన్ హీరోలు ధోని, తాహీర్, హర్భజన్లు సూపర్ కింగ్స్కు ఈ ఏడాది తిరుగులేని విజయాలు అందించారు. యువ కెరటం దీపక్ చాహర్ అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. బ్యాట్స్మన్ విఫలమైన చోట బౌలర్లు మెరువటం, బంతితో ఇబ్బందిపడిన వేళ.. బ్యాట్స్మన్ చెలరేగటం సూపర్కింగ్స్ ఆనవాయితీగా వస్తోంది. ఉప్పల్ మ్యాచ్లోనూ ధోనీజట్టు అదే ట్రెండ్ను కొనసాగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. హ్యాట్రిక్ ఓటముల ఒత్తిడిలో కనిపిస్తోన్న హైదరాబాద్కు నేటి మ్యాచ్లో విజయం అత్యంత కీలకం. టాప్ ఆర్డర్లో వార్నర్, బెయిర్స్టో సహా విలియమ్సన్లు మరింత బాధ్యత తీసుకోవాలి. మిడిల్ ఆర్డర్ను అద్భుతాలు చేయకపోయినా, ఆశలు వమ్ముకాకుండా జాగ్రత్త పడితే చాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. తాలా ధోని రానుండటంతో నేడు స్టేడియం మద్దతు రెండుగా చీలనున్నది. మహి బరిలో ఉన్న వేళ ఉప్పల్ స్టేడియం చెపాక్ను తలపించనుందని చెప్పటం అతిశయోక్తి కాదు. గత సీజన్లలో మహి జట్టుకు హైదరాబాద్ అభిమానులు బ్రహ్మరథ పట్టారు. నేటి మ్యాచ్లోనూ సూపర్ కింగ్స్కు హైదరాబాద్కు దీటుగా మద్దతు లభించనున్నది.