Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్పై బీసీసీఐ నిర్ణయం
ముంబయి : 2019 ఐసీసీ వన్డే వరల్డ్కప్కు ఆటగాళ్లకు తోడుగా భార్యలు, ప్రియురాళ్లు వెళ్లేందుకు వీల్లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించినట్టు సమాచారం. మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే మెగా ఈవెంట్లో జీవిత భాగస్వాములు తోడుగా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వినతిని పాలకుల కమిటీ (సీఓఏ) తిరస్కరించింది. ప్రపంచకప్ జరిగే తొలి 20 రోజుల పాటు భార్యలు, ప్రియురాళ్లు వెంట వచ్చేందుకు వీల్లేదని.. అవసరమైతే టోర్నీ ద్వితీయార్థంలో ఉండవచ్చని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భార్యలను అనుమతించని సంగతి తెలిసిందే. వరల్డ్కప్కు ముందు పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడనున్నది. ఆటగాళ్లు భార్యలను ఈ సిరీస్కు తీసుకెళ్లవచ్చని.. ప్రపంచకప్ సందర్భంగా తోడుగా ఉండేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.