Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న హైదరాబాద్లో ఐపీఎల్ ఫైనల్
- విశాఖపట్నంలో ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లు
- చెన్నైలో క్వాలిఫయర్-1 మ్యాచ్లు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్-12 ఫైనల్ మ్యాచ్కు ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికకానున్నది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక హైదరాబాద్ను ఖరారు చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పాలకుల కమిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. మే-12న జరగనున్న ఈ మ్యాచ్ కోసం చెన్నై స్టేడియంలో ఐ, జే, కే స్టాండ్స్ని ప్రారంభించడానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇవ్వకపోవడంతో ఫైనల్ మ్యాచ్ వేదికను హైదరాబాద్కు మారుస్తున్నామని అధికారులు తెలిపారు. చెన్నైలోని చెపాక్లో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా... విశాఖపట్నం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫయర్-2 మ్యాచ్లు జరగనున్నాయి. మే-7న చెన్నైలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనున్నది. అయితే ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లు రెండూ హైదరాబాద్లోనే జరుగుతాయని భావించినప్పటికీ మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున భద్రతాపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉండటంతో మ్యాచ్లను విశాఖకు తరలించినట్టు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మే-8న ఎలిమినేటర్, మే-10న క్వాలిఫయర్-2 మ్యాచ్లు రెండూ విశాఖలో జరగనున్నాయి.