Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై ధోని కామెంట్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఖరు బంతి వరకూ ఉత్కంఠ రేపిన ఐపీఎల్12 ఫైనల్లో ముంబయి ఇండియన్స్ 1 పరుగు తేడాతో గెలుపొందింది. ఛేదనలో షేన్ వాట్సన్ మెరిసినా, లసిత్ మలింగ మ్యాజిక్ చెన్నై సూపర్ కింగ్స్ శిబిరాన్ని షాక్కు గురి చేసింది. టైటిల్ పోరులో ఇరు జట్లూ పొరపాట్లు చేసినా.. విజేత ముంబయి ఇండియన్స్ ఒక్క తప్పు తక్కువ చేసిందని ధోని వ్యాఖ్యానించాడు. ' ఫైనల్స్ మ్యాచ్ను ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఇదెంతో ఫన్నీ ఫైనల్.. ఇరు జట్లతో ట్రోఫీ తోబూచులాడింది. రెండు జట్లు తప్పులు చేశాయి. కానీ అంతిమంగా విజేత ఒక తప్పు తక్కువ చేస్తుంది. జట్టుగా చెన్నైకి ఇది మంచి సీజన్. గతంలో గొప్ప క్రికెట్ ఆడిన సీజన్ల వంటిది కాదు ఇది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయినా, ఏదోవిధంగా రాణించాం' అని మ్యాచ్ అనంతరం ధోని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది గురించి చెప్పటం తొందరపాటు అవుతుంది. ప్రస్తుతానికి ప్రణాళికలు ప్రపంచకప్ కోసమే. అదే తొలి ప్రాధాన్యం. దాని తర్వాత సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుతానని ధోని అన్నాడు.