Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీ స్టార్ జాంటీ రోడ్స్
ముంబయి : భారత్కు అత్యుత్తమ 15 మంది బృందం ఉన్నా.. 2019 వరల్డ్కప్ ఓపెన్ రేసు అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. ' భారత్కు బెస్ట్ 15 మెంబర్స్ ఉండవచ్చు. ఇదే విధంగా మరో ఆరు జట్లు అనుకుంటున్నాయి. ప్రపంచకప్లో బలమైన జట్లు బరిలో నిలిచాయి. ఎంచుకునే 11 మంది కూర్పుపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. భారత్కు మంచి అనుభవం ఉంది. యువ సీమర్ జశ్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ అనుభవజ్ఞుడైన డెత్ బౌలర్. ఈ కోణంలో భారత్ తన అవకాశాలను పెంచుకుంటుంది. కానీ ఇదే సమయంలో రేసులో మరో ఆరు జట్లు ఉన్నాయి. ఏడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ను వదిలేసినా.. రేసు జోరుగా ఉంది. ఫార్మాట్ మారిన నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కీలకమే. తాజా వన్డే ఫామ్తో విండీస్ సైతం ప్రమాదకర జట్టు. ప్రపంచకప్లో మరిన్ని అసోసియేట్ జట్లు ఆడాలని కోరుకుంటున్నాను' అని జాంటీ రోడ్స్ అన్నాడు.
కోహ్లి నెగ్గితే ఆశ్చర్యం లేదు : విరాట్ కోహ్లి సారథ్యంలో టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధిస్తే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్ అన్నాడు. ' కోహ్లికి వ్యతిరేకంగా రాయాలని అనుకోను. ఎందుకంటే, అతడే ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్ను అందించాడు. అతడో గొప్ప కెప్టెన్. అత్యుత్తమం కోసమే కోహ్లి అవతరించినట్టుంది. నాయకుడిగా, ఆటగాడిగా కోహ్లి బెస్ట్ అందించగలడు. అద్భుత ఆటగాళ్లతో కూడిన భారత్ ప్రపంచకప్ నెగ్గితే నేను ఆశ్చర్యపడను' అని కటిచ్ పేర్కొన్నాడు. భారత్, పాకిస్థాన్లపై వరుస విజయాలకు తోడు డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ పునరాగమనం ఆస్ట్రేలియాను రేసులో ముందుంజలో నిలిపింది. స్థానిక పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఎప్పుడూ ఫేవరెటే. ప్రపంచకప్లో కఠిన ప్రత్యర్థి ఇంగ్లాండేనని తెలిపాడు.