Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా బౌలింగ్తో ముచ్చెమటలు పట్టిస్తాం.
- భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్
ముంబయి: ప్రపంచకప్ సమరం ప్రారంభం కావటానికి మరో రెండు వారాలే మిగిలిఉన్నది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగి సత్తా చాటాలని తహతహలాడుతున్నది..ఎంపిక చేసిన భారత జట్టులో మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు కానీ, జట్టును బౌలర్ల ఫామ్ గురించే అందరికీ బెంగ. ఐపీఎల్లో కుల్దీప్ యాదవ్ ఫామ్ కోల్పోయితే.. షమీ కూడా మునుపటిలా ఆకట్టుకోలేదు. ప్రపంచకప్ జట్టులో వీరిద్దరూ ఉన్నారు. టీమిండియా బౌలర్ల ఫామ్పై వస్తున్న విమర్శలపై టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు. 'ఇంగ్లాండ్లో కొన్నాళ్లుగా పిచ్ చాలా ఫ్లాట్గా ఉంది. కానీ ప్రపంచ కప్లో పాల్గొనే జట్లన్నీ టీమిండియా బౌలింగ్ యూనిట్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్లుగా భారత జట్టు బౌలర్ల పనితీరే ఇందుకు నిదర్శనం. రోజు రోజుకూ జట్టు బౌలింగ్ మెరుగవుతున్నది. ఎలాంటి పిచ్నైనా ఇండియన్ పేసర్లు రాణించగలరు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ల బౌలింగ్ తీరు ఎలాంటిదో అన్ని జట్లకూ ఇప్పటికే ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. నేను కూడా నా సామర్థ్యం మేరకు ప్రపంచ కప్లో రాణిస్తానని నమ్ముతున్నాను' అని అన్నాడు.