Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్వదేశంలో డేవిస్కప్లో పాల్గొనే భారత జట్టులో లియాండర్ పేస్ను ఎంపిక చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 20 వరకూ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో చెక్ రిపబ్లిక్తో భారత్ తలపడుతుంది. ఈ టోర్ని కోసం నలుగురు ఆటగాళ్లు ఉన్న భారత జట్టును ప్రకటించారు. ఇందులో లియారడర్ పేస్, రోహన్ బోపన్న, సోమ్దేవ్ దేవ్వర్మన్, యుకీ బాంబ్రీ ఉన్నారు. మార్చిలో న్యూజిలాండ్లో జరిగిన డేవిస్కప్ మ్యాచుల్లో పాల్గొన్న సాకేత్ మైనేని ఈ సారి టోర్నిల్లో పాల్గొనడం లేదు. సాకేత్ స్థానంలో పేస్ ఆడనున్నాడు. పేస్ రాకతో భారత డబుల్స్ టీమ్ మరింత పటిష్టంగా తయారవుతుందని కోచ్ జీషన్ అలీ అన్నారు. రోహన్ బోపన్నతో కలిసి లియాండర్పేస్ డబుల్స్ బరిలోకి దిగనున్నాడు.