Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 0-5తో చిత్తుగా ఓడిన భారత్
- సుధీర్మన్ కప్ నుంచి నిష్క్రమణ
నాన్నింగ్ (చైనా) : సుధీర్మన్ కప్ బ్యాడ్మింటన్లో భారత్కు మరోసారి భంగపాటు. మూడు దశాబ్దాల సుదీర్మన్ కప్ చరిత్రలో తొలిసారి బలమైన బృందంతో బరిలోకి దిగిన భారత్, గ్రూప్ దశలో ఒక్క విజయమైనా సాధించకుండా ఓటమిపాలైంది. చైనా, మలేషియాలతో కూడిన గ్రూప్-డిలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తొలుత మలేషియా చేతిలో 2-3తో ఓడిన భారత్, బుధవారం అగ్ర జట్టు చైనా చేతిలో 0-5తో దారుణ పరాజయం మూటగట్టుకున్నది. రెండు విజయాలతో చైనా, ఓ విజయంతో మలేషియా సుదీర్మన్ కప్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. మెన్స్ సింగిల్స్లో సమీర్ వర్మ, మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్లు సైతం వరుస గేముల్లో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డి జోడీ 5-21, 11-21తో అరగంటలోపే మ్యాచ్ను అప్పగించింది. మెన్స్ సింగిల్స్లో సమీర్ వర్మ 17-21, 20-22తో చెన్ లాంగ్తో పోరాడి ఓడాడు. 72 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమీర్ వర్మ గొప్పగా ఆడాడు. కానీ కీలక సమయాల్లో పాయింట్లు కోల్పోయాడు. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ 12-21, 17-21తో చెన్ యుఫెరు చేతిలో వరుస గేముల్లో ఓడగా... పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు 21-18, 15-21, 17-21తో మూడు గేముల మ్యాచ్లో పోరాడి ఓడారు. చివరగా మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డిలు 12-21, 15-21తో పరాజయం పాలయ్యారు.