Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐకి క్రీడా మంత్రి మద్దతు
న్యూఢిల్లీ : ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో సైనిక చిహ్నంతో కూడిన వికెట్ కీపింగ్ గ్లోవ్స్ ధరించటంపై భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్లో కొత్త వివాదానికి కారణమయ్యాడు!. దేశం పట్ల, ఆర్మీ పట్ల ధోని ప్రేమాభిమానాలు అందరికీ తెలుసు. పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంతాపంగా ఆస్ట్రేలియాతో రాంచీ వన్డేలో భారత్ ఆర్మీ టోపీలతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. భారత ఆర్మీ టోపీలు ధరించాలనే ఆలోచన ధోనిదే. కెరీర్లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న ధోని తొలిసారి పారాచూట్ రెజిమెంట్కు చెందిన సైనిక చిహ్నంతో బరిలోకి దిగాడు. సైనిక చిహ్నంతో కూడిన ధోని గ్లోవ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత్ పూర్తిగా ధోని వైపు నిలువగా.. నిబంధనలకు విరుద్దమని ఐసీసీ వాదించింది. నిబంధనల ప్రకారం గ్లోవ్స్పై తయారీదారు పేరు మాత్రమే ఉండాలి. రాజకీయ, సైనిక, కమర్షియల్ లోగోలను అను మతించరు. ధోని గ్లోవ్స్పై తయారీదారు పేరు 'ఎస్జీ' ఉన్నందున, సైనిక చిహ్నం తొలగించాలని బీసీసీఐకి ఐసీసీ సూచించింది. ధోని గ్లోవ్స్పై చిహ్నం విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని, ఆ గ్లోవ్స్తో తర్వాత మ్యాచులు ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ తిరిగి ఐసీసీకి లేఖ రాసింది. సైనిక చిహ్నం కాదని ప్రపంచకప్ నిర్వాహక కమిటీ భావిస్తే, ధోని అదే గ్లోవ్స్తో ఆడవచ్చు. లేదంటే చిహ్నంపై స్టికర్ అతికించాల్సి ఉంటుంది. 'దేశ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో, దేశ ప్రయోజనాలను గమనంలో ఉంచుకోవాలి. ఈ విషయాన్ని ఐసీసీ వద్ద బీసీసీఐ ప్రస్తావించాలి' అని క్రీడా మంత్రి కిరణ్ రిజ్జు వ్యాఖ్యానించారు.