Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ కెప్టన్కు క్రికెట్ బోర్డు ఫోన్
లాహోర్ : ప్రపంచకప్లో ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 89 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై ఇంకా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్కు ఫోన్ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఓ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. పాక్ చీఫ్ సెలెక్టర్ ఇషాన్ మనీ మంగళవారం సర్ఫరాజ్కి ఫోన్ చేసి మాట్లాడారని తెలిపింది. భారత్తో ఓటమికి చింతించకుండా తదుపరి జరగబోయే మ్యాచ్లపై దృష్టి సారించాలని మనీ సూచించినట్లు తెలిపింది. దేశం మొత్తం పాక్ జట్టుకు అండగా ఉందని, మీడియాలో ప్రసారమయ్యే వార్తల గురించి పట్టించుకోకుండా ఆట మీద ధ్యాస పెట్టాలని మనీ నమ్మకం కలిగించినట్లు తెలిపింది. పాకిస్తాన్కు ఇంకా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నందున అనవసర విషయాలపై స్పందించకుండా జట్టుని ముందుండి నడిపించాలని సర్ఫరాజ్కు మనీ ధైర్యం చెప్పారు. ఏది ఏమైనా పాక్ ఆటగాళ్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్అక్తర్ సైతం తన యూట్యూబ్ ఛానెల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల తప్పుల్ని ఎండగట్టాడు. కెప్టెన్తో సహా ఎవరెవరు ఏయే తప్పులు చేశారో ఆ వీడియోలో వివరించాడు.