Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో చిలీపై 4-2తో విజయం
- హాకీ ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్
హిరోషిమా (జపాన్) : 2020 ఒలింపిక్స్ దిశగా భారత హాకీ మహిళల జట్టు మరో అడుగు ముందుకేసింది. ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరుకున్న అమ్మాయిలు 2020 ఒలింపిక్స్ చివరి అర్హత రౌండ్కు చేరుకున్నారు. చిలీతో జరిగిన సెమీఫైనల్లో 4-2తో గెలుపొందిన రాణిసేన.. ఫైనల్లో జపాన్/ రష్యాలతో తలపడనుంది. సెమీస్లో చిలీ తొలుత గోల్ కొట్టింది. 18వ నిమిషంలో కరొలినా గార్సియా గోల్తో చిలీ 1-0 ఆధిక్యం సాధించింది. గుర్జీత్ కౌర్ 22వ నిమిషంలో గోల్ చేసి 1-1తో స్కోరు సమం చేసింది. ప్రథమార్థం ముగిసేసరికి ఇరు జట్లూ సమవుజ్జీలుగా నిలిచాయి.
31వ నిమిషంలో నవనీత్ కౌర్ గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్.. 37వ నిమిషంలో గుర్జీత్ కౌర్ రెండో గోల్తో గెలుపు ఖాయం చేసుకుంది. 43వ నిమిషంలో మాన్యులె గోల్తో చిలీ 2-3తో అంతరం తగ్గించింది. కానీ కెప్టెన్ రాణి రాంపాల్ 57వ నిమిషం గోల్తో 4-2తో ఘన విజయాన్ని అందించింది.