Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాంచెస్టర్ : ఆరు మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించిన వెస్టిండీస్ ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్పై కార్లోస్ బ్రాత్వేట్ (101) వీరోచిత శతకంతో చెలరేగినా ఆఖర్లో కరీబియన్లకు పరాజయమే ఎదురైంది. ప్రపంచకప్లో మెరుగైన విజయాలతో స్వదేశానికి చేరాలని భావిస్తున్న విండీస్కు మరో గట్టి దెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ అండ్రీ రసెల్ మోకాలి గాయంతో ప్రపంచకప్కు దూరమయ్యాడు. ఇప్పటికే గాయంతో బెంచ్కు పరిమితమైన రసెల్, విండీస్ ఆశలు ఆవిరి కావటంతో స్వదేశానికి పయనం కానున్నాడు. రసెల్ స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ సునీల్ ఆంబ్రోస్ను వెస్టిండీస్ జట్టులోకి తీసుకుంది. జూన్ 27న, మాంచెస్టర్లో అగ్ర జట్టు భారత్ను వెస్టిండీస్ ఎదుర్కోనుంది.