Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్వెల్త్ క్రీడల బహిష్కరణపై క్రీడా మంత్రి
న్యూఢిల్లీ : 2022 కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ను తొలగించడాన్ని నిరసిస్తూ బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ను భారత ఒలింపిక్ సంఘం బహిష్కరిస్తుందనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా బహిష్కరణ స్వరం బలంగా వినిపించేలా గత వారం మాట్లాడారు. దీనిపై భారత క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజ్జు స్పందించారు. ' షూటింగ్ సమాఖ్యతో మాట్లాడలేదు. వారి వైఖరి ఏవిధంగా ఉందో తెలియదు. క్రీడలను బహిష్కరించాలని భావిస్తే, ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇటువంటి నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోలేరు. సరైన సంప్రదింపుల ద్వారానే జరగాలి. ఇది యువ అథ్లెట్ల భవిష్యత్, జాతీ గౌరవానికి సంబంధించినది. ఒలింపిక్ సంఘం ఏ నిర్ణయానికి సిద్ధమైనా, ముందుగా ప్రభుత్వం చర్చించాలి' రిజ్జు అన్నారు. ఒలింపిక్స్, అంతర్జాతీయ టోర్నీలు, ప్రపంచకప్లు నిర్వహించడాన్ని ఏ దేశమైనా గౌరవంగా భావిస్తుంది. ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ల నిర్వహణ సంగతి పక్కనపెడితే, ఆ పోటీలకు మన సన్నద్ధత ఏ విధంగా ఉందనేది ప్రధానమని రిజ్జు అభిప్రాయపడ్డారు.