Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసక్తి వ్యక్తపరిచిన ఐఓఏ
లసానె : ఒలింపిక్స్ చరిత్రలో భారత్ రెండోసారి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెషన్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. 2020 వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్య నగరాన్ని ఎంపిక చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం 2022-23 సెషన్లో సమావేశం కానుంది. ఐఓసీ సెషన్ ఆతిథ్య హక్కులను భారత్కు అందించాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరెందర్ బత్రా, ఐఓసీ సభ్యురాలు నీతా అంబాని మంగళవారం లసానెలోని ప్రధాన కార్యాలయంలో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్కు ఆసక్తి వ్యక్తీకరణ పత్రం అందజేశారు. ఐఓసీ అంగీకారం తెలిపితే, ముంబయి ఆతిథ్య నగరంగా ఎంపిక కానుంది. ' 2022-23లో భారత్ స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు ముగించుకుంటుంది. ఆ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కుటుంబం మొత్తం భారత్లో ఉండటానికి మించి, భారత క్రీడలను వేడుక చేసేందుకు మరొకటి ఏముంటుంది?' అని నరెందర్ బత్రా అన్నారు.