Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు సీఓఏ సమావేశం
న్యూఢిల్లీ : భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారిన విరుద్ధ ప్రయోజనాల అంశంపై బీసీసీఐ పాలకుల కమిటీ నేడు చర్చించే అవకాశం కనిపిస్తోంది. చైర్మన్ వినోద్ రారు అధ్యక్షతన సీఓఏ నేడు న్యూఢిల్లీలో సమావేశం కానుంది. మాజీ ఆటగాళ్లు, క్రికెట్ సలహా సంఘం సభ్యులు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లు వ్యాఖ్యాత, బోర్డు పదవిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డికె జైన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు లక్ష్మణ్ ఇదివరకే తన నిర్ణయాన్ని వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ సైతం అదే నిర్ణయాన్ని లేఖలో బీసీసీఐకి తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మరింత లోతైన చర్చ అవసరమని సీఓఏ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో వీడ్కోలు ప్రకటించిన క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్పలు సైతం ప్రపంచకప్లో వ్యాఖ్యాతలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరికి విరుద్ధ ప్రయోజనాలు వర్తిస్తాయని డికె జైన్ పరోక్షంగా చెప్పారు. ' ఒక సమమంలో ఒక వ్యక్తికి ఒకే పదవి' అనే బీసీసీఐ రాజ్యాంగ స్ఫూర్తితో తీర్పు చెప్పినట్టు అంబుడ్స్మన్ వెల్లడించారు. బీసీసీఐ ఎన్నికలుత అక్టోబర్ 22న జరుగనుండా.. అంతకుముందే రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. అందుకు జులై 1 లోగా ఎన్నికల అధికారులను నియమించాలి. దీనిపై సీఓఏ కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ ఎన్నికల కోసం మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్. గోపాలస్వామిని నియమించిన సంగతి తెలిసిందే.