Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లీడ్స్ : క్రికెట్ ప్రత్యర్థులు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రశాంతంగా ముగి సింది. పొరుగు దేశాలు పాకిస్థాన్, భారత్ ఆసక్తికపోరూ అద్భుతంగా జరిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్లోనూ ఎటువంటి ఘర్షణలు లేవు. కానీ పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మ్యాచ్లో అపశృతి దొర్లింది!. ఇరు జట్ల అభిమానులు గొడవకు దిగారు. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్లది విడదీయలేని బంధం. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఈ రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆధారపడ్డారు. భౌగోళిక రాజకీయ వ్యత్యాసాలు లీడ్స్లో బయటపడ్డాయి. మ్యాచ్ ఆరంభానికి ఒక గంట ముందు అభిమానులు గొడవకు దిగారు. ఇరు గ్రూపులు పిడి గుద్దులు మార్పిడి చేసుకున్నాయి. అభిమానుల ఫైట్ వీడియో తీసే ప్రయత్నం చేసిన పాత్రికేయులపై నీళ్ల బాటిళ్లు విసిరారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గొడవకు దిగిన అభిమానుల బృందాన్ని బయటకు పంపించింది. మరోవైపు టికెట్ లేకపోయినా, స్టేడియంలోకి వచ్చేందుకు కొంత మంది దురుసుగా ప్రవర్తించారు. మైదానంలో ' బలూచిస్థాన్కు న్యాయం చేయండి' (జస్టిస్ ఫర్ బలూచిస్థాన్) బ్యానర్ అభిమానుల మధ్య ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. యూరోప్లో ఫుట్బాల్ మ్యాచుల్లో అభిమానుల బాక్సింగ్ ఫైట్ సర్వసాధారణం. క్రికెట్లో అభిమానుల ఘర్షణ అత్యంత అరుదు అనే చెప్పాలి!.