Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారు అథ్లెట్లతో క్రీడా మంత్రి
పాటియాల : భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు) కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అథ్లెట్లు అందరికీ ఒకే విధమైన భోజనం అందించాలని క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజ్జు ఆదేశించారు. పాటియాల సారు సెంటర్లో మహిళా అథ్లెట్ల హాస్టల్ను సందర్శించిన కిరణ్ రిజ్జు.. అక్కడే భోజనశాలలో అథ్లెట్లలో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సమయంలో శిక్షణలోని (ట్రైనీ అథ్లెట్లు) అథ్లెట్లు, సీనియర్ అథ్లెట్లు, జూనియర్ అథ్లెట్లకు విభిన్న మెనూ అందించడాన్ని గమనించిన మంత్రి.. అందరికీ సమానంగా ఒకే డైట్ అమలు చేయాలని చెప్పారు. ' క్రీడాకారులకు డైట్ ఎంతో ముఖ్యం. సరైన పోషకాహారం లేకుండా ఏ చిన్నారీ ప్రపంచ చాంపియన్ కాలేదు. స్థాయి బట్టి అథ్లెట్ డైట్ ఆధారపడకూడదు. అందరికీ ఒకే విధమైన భోజనం అందించేందుకు బడ్జెట్ అడ్డు రాకూడదు' అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజుకు ట్రైనీలకు రూ. 250, జూనియర్ అథ్లెట్లకు రూ. 480, సీనియర్ అథ్లెట్లకు రూ. 650 అందిస్తున్నారు. ఇక నుంచి అందరికీ రూ. 650 ఇవ్వనున్నారు. సారు శిక్షణ కేంద్రాల్లో సుమారు రూ. 12000 మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. సమాన డైట్ కోసం ప్రభుత్వం ఏడాదికి అదనంగా రూ. 150 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.