Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్ కోచ్ మికీ ఆర్థర్
లండన్ : ప్రపంచకప్లో టీమ్ ఇండియా ఓటమిని పాకిస్థాన్ జీర్ణిం చుకోలేకపోతుంది!. పాకిస్థాన్ సెమీఫైనల్స్ అవకాశాలు ఇంగ్లాండ్పై భారత్ విజయంపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్పై కోహ్లిసేన విజయం సాధించలేదు. పాకిస్థాన్ చీఫ్ కోచ్ మికీ ఆర్థర్ స్పందించాడు. ' భారత్ ఏ విధంగా ఆడింది, అనేది మా ఆధీనంలో లేని అంశం. భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ను ఆసక్తిగా చూశాను. పాక్ కోసం భారత్ విజయం సాధించకపోవటం నిరాశపరిచింది. ఇప్పుడు మా దృష్టంతా శుక్రవారం మ్యాచ్పైనే. మా అవకాశం మా చేతుల్లో ఉంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. మా కోసం భారత్ చేయని పని, కివీస్ చేస్తుందని ఆశిస్తున్నాం' అని మికీ ఆర్థర్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 ఛేదనలో భారత్ 306 పరుగులే చేసిన సంగతి తెలిసిందే.