Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బార్టీ, క్విటోవా, నిషికోరి ముందంజ
- వింబుల్డన్ గ్రాండ్స్లామ్
లండన్ : టెన్నిస్ దిగ్గజం, అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. జర్మనీ ప్లేయర్ జులియాపై 6-3, 6-4తో వరుస సెట్లలో గెలుపొందిన విలియమ్స్..వింబుల్డన్ ప్రీ క్వార్టర్స్కు చేరటం ఇది 16వ సారి. క్వార్టర్స్ దారిలో స్పెయిన్ అమ్మాయి కార్లా స్వారెజ్ నవారోతో సెరెనా తలపడనుంది. ' నా ప్రదర్శన పట్ల కొంత ఆందోళన నాలో కనిపిస్తోంది. ఈ ఏడాది 15 మ్యాచులే ఆడాను. అందుకే మిక్స్డ్ డబుల్స్ ఆడాలని అనుకుంటున్నా' అని సెరెనా విలియమ్స్ తెలిపింది. మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్స్లామ్స్ రికార్డుకు సెరెనా అడుగు దూరంలో నిలిచింది. టాప్ సీడ్ అష్లె బార్టీ (ఆస్ట్రేలియా) 6-1, 6-1తో డార్ట్ (ఇంగ్లాండ్)పై వరుస సెట్లలో గెలుపొందింది. ఆరో సీడ్ పెట్రా క్విటోవా 6-3, 6-2తో అలవోక విజయం సాధించి ప్రీ క్వార్టర్స్లో కాలుమోపింది. మెన్స్ సింగిల్స్లో కిరు నిషికోరి (జపాన్) 6-4, 6-3, 6-2తో జాన్సన్ (అమెరికా)పై మూడో రౌండ్లో గెలుపొందాడు. శామ్ ఖుర్రే (అమెరికా) 7-6(7-3), 7-6(10-8), 6-3తో జాన్ మిల్మ్యాన్ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచాడు. ఫ్రాన్స్ ఆటగాడు సొంగాపై రఫెల్ నడాల్ వరుస సెట్లలో గెలుపొంది ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నాడు.