Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఫ్గాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం
కాబూల్ : క్రికెట్ ప్రపంచకప్లో స్ఫూర్తిదాయక ప్రవేశం, శరణార్థ శిబిరాల్లో పురుడు పోసుకున్న అఫ్గాన్ క్రికెట్, అగ్రజట్లను ఎదురించే స్థాయికి ఎదిగిన అఫ్గాన్ జట్టు.. ఇలా సాగిన అఫ్గనిస్థాన్ ప్రయాణం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. క్రికెట్ ఉజ్వలంగా ఎదుగుతున్న దశలో బోర్డులో రాజకీయాలు, డ్రెస్సింగ్రూమ్లో సఖ్యత లోపించటం అఫ్గాన్ క్రికెట్ను తిరోగమనం దిశగా తీసుకెళ్తుంది. 2019 ప్రపంచకప్ జట్టు నుంచి అర్థాంతరంగా తప్పించబడిన అఫ్తాద్ ఆలంపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు విచారణ కమిటీ నియమించింది. జూన్ 27న అఫ్తాద్ను జట్టును తప్పించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. సౌతాంప్టన్లో అఫ్గనిస్థాన్ బస చేసిన హౌటల్లో ఓ అతిథి మహిళతో అఫ్తాద్ అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఐసీసీ క్రమశిక్షణ నియమావళి ఉల్లంఘించిన అఫ్తాబ్పై వేటు వేయాలని ఐసీసీ సూచించగా, ఏసీబీ వెంటనే తప్పించింది. ఇదే కాకుండా, భారత్తో మ్యాచ్ అనంతరం జట్టు సమావేశానికి అఫ్తాద్ డుమ్మా కొట్టాడు. లండన్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దీంతో కోచ్ అతడిపై రెండు మ్యాచుల నిషేధం విధించాడు. ఇదిలా ఉండగా జూన్ 16న, మాంచెస్టర్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు స్నేహితులతో కలిసి అఫ్తాద్ వీవీఐపీ గ్యాలరీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది నిలువరించారు. క్రికెటర్ గుర్తింపు కార్డుతో అఫ్తాద్ లోపలకి ప్రవేశించినా.. భద్రత సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు పంపించారు. ఈ ఘటనపై ఏసీబీ గుర్రుగా ఉంది.
మరోవైపు బోర్డులోని ఇద్దరు కీలక అధికారులపైనా విచారణ జరిపేందుకు ఏసీబీ పచ్చజెండా ఊపింది. తాత్కాలిక సీఈవో బాధ్యతలు అందుకున్న వెంటనే అసదుల్లా ఖాన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాడని, సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా జద్రాన్ అహ్మద్జారు కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ను తొలగించి గుల్బాదిన్ నైబ్ను నియమించాడు. అస్గర్ను టెస్టు, టీ20 కెప్టెన్సీ నుంచీ తప్పించాడు. ఈ నిర్ణయాలు అఫ్గాన్ క్రికెట్లో కలకలం రేపాయి. ఏసీబీ ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనుంది.