Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్
కోల్కత : భారత్కు రెండు ప్రపంచకప్ విజయాలు అందించిన దిగ్గజ ఆల్రౌండర్, అత్యధిక ప్రపంచకప్లు ఆడిన (అన్ని స్థాయిల్లో) ఆటగాడు యువరాజ్ సింగ్ గత నెలలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. జాతీయ జట్టు తరఫున తిరుగులేని ప్రదర్శన చేసిన యువరాజ్ సింగ్, కెరీర్ భీకర్ ఫామ్లోనూ ఐపీఎల్లో మెప్పించలేదు. ఐపీఎల్లో యువరాజ్ సింగ్ ఏకంగా ఆరు ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలు దిగ్గజ ఆటగాళ్లుగా ఓ ప్రాంఛైజీలో పాతుకుపోయారు. కానీ దిగ్గజ ఆటగాడిగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ప్రారంభమైన యువరాజ్ సింగ్ ఐపీఎల్ కెరీర్.. సంతృప్తికరంగా ముగియలేదు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్, 2019లో ముంబయి ఇండియన్స్ తరఫున యువరాజ్ ఐపీఎల్ చాంపియన్గా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్లో ఐపీఎల్లో ఏ ప్రాంఛైజీలోనూ కుదురుకోలేకపో యానని యువరాజ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఐపీఎల్లో నేను ప్రాతినిథ్యం వహించిన ఏ ప్రాంఛైజీ తరఫునా కుదురుకోలేదు. ఒకటి రెండు ప్రాంఛైజీలతో కుదరుకోవాల్సినది, నేడు ఎక్కడా ఇమడలేదు. 2014లో కోల్కత నైట్రైడర్స్కు వెళ్తున్నానని అనుకున్నాను. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ప్రవేశంతో బెంగళూర్కు వెళ్లాను. కోల్కతను ఆడలేకపో వటం దురదృష్టకరం. ఆర్సీబీ తరఫున సంతృప్తికర సీజన్ ఆడాను' అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. వేలంలో విస్మరించటంపై బాధ లేదు. అన్ని జట్లతో ప్రయాణం మంచి అనుభవం. ముంబయి, హైదరాబాద్ తరఫున విజేతగా నిలువటం గొప్ప అనుభవం' అని యువీ అన్నాడు కోల్కతలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ సింగ్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు.