Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోని బ్యాటింగ్ స్థానంపై మాజీలు
మాంచెస్టర్ : ప్రపంచకప్ సెమీఫైనల్లో సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన పంపటం టీమ్ ఇండియా వ్యూహాత్మక తప్పిదంగా మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లు అభిప్రాయపడ్డారు. ఐదు పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ 24/4తో మరింత కష్టాల్లో పడింది. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యలు బ్యాటింగ్ ఆర్డర్లో ధోని కంటే ముందొచ్చారు. ' దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య కంటే ముందు ధోనిని పంపాల్సింది. భారత జట్టు వ్యూహాత్మక తప్పిదం ఇది. 2011 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇలాంటి పరిస్థితుల్లో ధోని తనను తాను నం.4కు ప్రయోట్ చేసుకున్నాడు. భారత్కు ప్రపంచక ప్ను అందించాడు. 5/3, 24/4 దశలో భారత్కు ఓ అనుభవజ్ఞుడు అవసరం. పంత్ ఆడుతుండగా, ధోని తోడుగా ఉండుంటే అటువంటి షాట్ ఆడేందుకు మహి ఒప్పుకునే వాడు కాదు. భారీ షాట్లకు స్పిన్నర్పై కాకుండా, పేసర్లపై వెళ్లాలని సూచించే వాడు. ధోని కచ్చితంగా ముందుగా బ్యాటింగ్కు రావాల్సింది. ఇక్కడ కేవలం బ్యాటింగ్ ఒక్కటే కాదు అనుభవం అవసరం. ఆ పరిస్థితుల్లో వికెట్ల పతనాన్ని ధోని అడ్డుకునే వాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తుండగా ధోని అండగా ఉన్నాడు. ధోనిని ఏడో స్థానంలో ఆడించాల్సింది కాదు. ఫీనిషర్గా ధోనికి ఇంకా గౌరవం ఉంది. ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీలు కొట్టగలడు. అందుకే చివరి వరకూ ఛేదనను తీసుకెళ్తాడు. ధోని సిక్సర్లు కొట్టలేక కాదు, వన్డేలను అలాగే ముగించాలని అతడు భావిస్తాడు' అని గంగూలీ, లక్ష్మణ్ ప్రసారదా రుతో వ్యాఖ్యానించారు.
మ్యాచ్ ప్రథమార్థంలో చాలా మెరుగైన స్థితిలో ఉన్నాం. బంతితో, ఫీల్డింగ్లో మంచి ప్రదర్శన చేశాం. ఎటువంటి పిచ్పై అయినా ఛేదించగల స్కోరుకు న్యూజిలాండ్ను పరిమితం చేశామని భావించాం. భారత ఇన్నింగ్స్లో తొలి అర గంట ఫలితాన్ని శాసించింది. విజేతకు, పరాజితకు అదే వ్యత్యాసం. న్యూజిలాండ్ బౌలర్లకు ఘనత దక్కాలి. వారు సరైన లెంగ్త్లో, సరైన ప్రదేశాల్లో బంతులు స ంధించారు. రవీంద్ర జడేజా తనదైన ప్రదర్శన చేశాడు, ఎం.ఎస్ ధోని చక్కటి భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. టోర్నీలో గొప్పగా ఆడి, ఓ 45 నిమిషాల చెత్త క్రికెట్ కారణంగా ఓడటం బాధిస్తుంది. మాపై ఒత్తిడి పెంచటంలో న్యూజిలాండ్ సఫలమైంది. మా షాట్ సెలక్షన్ మెరుగ్గా ఉండాల్సింది. మేం మంచి క్రికెట్ ఆడాం, సెమీస్కు చేరుకున్న తీరు పట్ల గర్వపడుతున్నాం. ఫైనల్స్కు చేరే అర్హత న్యూజిలాండ్కు ఉంది. మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు'
- విరాట్ కోహ్లి