Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే అగ్రస్థానానికి విలువ
మాంచెస్టర్ : ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమ్ ఇండియా అనూహ్య ఓటమితో నాకౌట్ ఫార్మాట్పై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. గ్రూప్ దశలో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో కోహ్లిసేన అగ్రస్థానంలో నిలిచింది. నెట్రన్రేట్ సాయంతో న్యూజిలాండ్ నాల్గో స్థానంతో నాకౌట్కు అర్హత సాధించింది. మాంచెస్టర్ సెమీఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో అనూహ్య పరాజయం పాలైంది. గ్రూప్ దశలో నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు, ఓ మ్యాచ్లో చెత్త ప్రదర్శనతో టోర్నీకి దూరం కావటం వరల్డ్కప్కు మేలు కాదని క్రికెట్ పండితులు అంటున్నారు. సెమీఫైనల్స్ స్థానంలో ఐపీఎల్ తరహా ప్లే ఆఫ్స్ ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ' భవిష్యత్లో ఏం జరుగుతుందో చెప్పలేం. నాకౌట్ బదులుగా ప్లే ఆఫ్స్ ఉండటం మంచిదే. అప్పుడే అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు సార్థకత ఉంటుంది' అని విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు.