Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : 2019 ప్రపంచకప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మ, యార్కర్ల హీరో జశ్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్గా నిలిచాడు. వరల్డ్ చాంపియన్ ఇంగ్లాండ్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఐసీసీ జట్టులో నిలువగా.. రన్నరప్ న్యూజిలాండ్ నుంచి ఇద్దరు చోటు సాధించారు. అత్యధిక వికెట్ల వీరుడు, ఆస్ట్రేలియా సీమర్ మిచెల్ స్టార్క్ ప్రధాన సీమర్గా జట్టులో నిలిచాడు. పరుగుల వరదతో పాటు వికెట్ల వేటలో దూసుకెళ్లిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ నం.4 బ్యాట్స్మన్గా జట్టులోకి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ 12వ ఆటగాడిగా చోటు దక్కించుకున్నాడు.
ఐసీసీ ప్రపంచకప్ జట్టు : రోహిత్ శర్మ (భారత్), జేసన్ రాయ్ (ఇంగ్లాండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), జో రూట్ (ఇంగ్లాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్), లాకీ ఫెర్గుసన్ (న్యూజిలాండ్), జశ్ప్రీత్ బుమ్రా (భారత్), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)