Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లార్డ్స్ : ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన కెప్టెన్కు క్రీడాభిమానుల్లోనే కాదు మీడియా కాన్ఫరెన్స్లోనూ గౌరవం, అభివాదం దక్కటం అత్యంత అరుదు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. 50 ఓవర్లలో 241, సూపర్ ఓవర్లో 15 పరుగులతో లార్డ్స్ ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సమవుజ్జీలుగా నిలిచాయి. బౌండరీల ఎక్కువ బాదిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో విజేతను గుర్తించకపోవటం, నిబంధనలపై వేలెత్తి చూపటం సహజం. విజేత ఇంగ్లాండ్కు అభినందనలు తెలిపిన విలియమ్సన్.. బౌండరీల తేడాతో విజేతను నిర్ణయించే నిబంధనపై ఫిర్యాదు చేయలేదు. ఓటమిలోనూ హుందాతనం చూపిన విలియమ్సన్ జెంటిల్మెన్ గేమ్లో నిజమైన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు. ' ఆదివారం ఫైనల్లో పరాజితులు ఎవ్వరూ లేరు. అన్నింట్లోనూ సమవుజ్జీలుగా నిలిచాం. కానీ ట్రోఫీ అందుకున్న జట్టు ఇంగ్లాండ్. ఇటువంటి మ్యాచుల్లో ప్రతి చిన్న విషయం కీలక పాత్ర పోషిస్తుంది. రెండు సార్లు టైగా ముగిసిన మ్యాచ్లో ప్రతి బంతిని నిశితంగా పరిశీలిస్తాం. అది సహజం కదా?. బౌండరీల తేడాతో విజేతను నిర్ణయించే పద్దతి ఇప్పుడు పెట్టింది కాదు. చాలా కాలం నుంచి కొనసాగుతున్న నిబంధనే' అని విలియమ్సన్ పేర్కొన్నాడు.