Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్లో అకానెతో సింధు ఢీ
- ప్రీ క్వార్టర్స్లో చెమటోడ్చిన స్టార్
- సాయిప్రణీత్ ముందంజ
- సాత్విక్, చిరాగ్ మెరుపులు
టోక్యో (జపాన్)
భారత బ్యాడ్మింటన్ తార, అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు జపాన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేషియా ఓపెన్ ఫామ్ కొనసాగించిన సింధు.. టోక్యో రెండో రౌండ్లో కాస్త తడబడినా, క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. లోకల్ షట్లర్ అయ ఒహౌరిపై 11-21, 21-10, 21-13తో సింధు విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో బి. సాయిప్రణీత్ చాన్నాండ్ల తర్వాత ఆకట్టుకునే విజయం అందుకున్నాడు. జపాన్కే చెందిన స్టార్ షట్లర్లపై వరుస విజయాలో క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. మెన్స్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మెరిసింది. చైనా జోడీపై మూడు గేముల ఉత్కంఠ మ్యాచ్లో పైచేయి సాధించింది. క్వార్టర్ఫైనల్లో కాలుమోపింది. నేడు జరిగే క్వార్టర్స్ సమరంలో ఇండోనేషియా ఫైనల్స్ ప్రత్యర్థి అకానె యమగూచి (జపాన్)తో సింధు తలపడనుంది. గత వారం జరిగిన ఇండోనేషియా ఓపెన్ టైటిల్ పోరులో జపాన్ షట్లర్ యమగూచి చేతిలో సింధు పరాజయం పాలైంది. నేడు యయగూచి సొంత అభిమానుల నడుమ ప్రతీకారం విజయం కోసం సింధు ఎదురుచూస్తోంది.
జకర్తా జోరుతో ఫామ్ సాధించిన పి.వి సింధు టోక్యో రెండో రౌండ్లో కాస్త తడబాటుకు లోనైంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో తనకంటే 15 స్థానాలు వెనుకబడిన షట్లర్ అయ ఒహౌరిపై విజయం కోసం సింధు మూడు గేములు ఆడాల్సి వచ్చింది. ఆరంభంలో అలసత్వం వహించిన సింధు పదేపదే అనవ సర తప్పిదాలకు పాల్పడింది. నెట్కు కొట్టడం, కోర్టు ఆవలకు కొట్టడంతో అయకు వరుస పాయింట్లు లభించాయి. 5-1తో ముందంజ వేసిన అయ, విరామ సమయానికి 11-5తో ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలోనూ సింధు తప్పిదాలు పునరావృతం చేయటంతో అయ తొలి గేమ్ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. రెండో గేమ్లోనూ జపాన్ చిన్నది 2-0తో ముందంజ వేసింది. తొలిసారి 3-2తో మ్యాచ్లో ఆధిక్యం సాధించిన సింధు, వెనక్కి తగ్గలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ 3-1, 8-4తో సింధు దూసుకెళ్లింది. కానీ అయ వరుసగా నాలుగు పాయింట్లతో 8-8తో స్కోరు సమం చేసింది. వరుసగా ఆరు పాయింట్లు సాధించిన సింధు 14-8తో గెలుపు లాంఛనం చేసుకుంది. ద్వితీ యార్థంలో జపాన్ అమ్మాయి పోటీ ఇవ్వలేకపోయింది.
పురుషుల సింగిల్స్లో భారత నం.1 షట్లర్ కిదాంబి శ్రీకాంత్ను ఓడించిన హెచ్.ఎస్ ప్రణరు రెండో రౌండ్లో నిలువలేదు. డెన్మార్క్ ఆటగాడు రొస్మస్ గెమ్కే చేతిలో 9-21, 15-21తో వరుస గేముల్లో చేతులెత్తేశాడు. జపాన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మరో ఆటగాడు బి. సాయిప్రణీత్ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్లో వరల్డ్ నం.11 కెంటా నిషిమోటను ఓడించిన సాయిప్రణీత్, రెండో రౌండ్లో కెంటా సునెయమపై గెలుపొందాడు. 21-13, 21-16తో 45 నిమిషాల్లోనే క్వార్టర్ఫైనల్స్ బెర్త్ సొంతం చేసుకున్నాడు. నేడు క్వార్టర్స్లో టామీ సుగియార్టోతో తలపడనున్నాడు. మెన్స్ డబుల్స్లో సాత్విక్, చిరాగ్ జోడీ 15-21, 21-11, 21-19తో చైనా జోడీ లీ చెంగ్, షియాంగ్లపై మెరుపు విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో అశ్విని తోడుగా సాత్విక్ 16-21, 17-21తో వరుస గేముల్లో థారులాండ్ జోడీ చేతిలో భంగపడ్డాడు.