Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెవిస్కప్పై పీటీఎఫ్ అధ్యక్షుడు
ఇస్లామాబాద్ (పాకిస్థాన్) : భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాల కారణంగా బలహీనపడుతున్న క్రీడా సంబంధాల జాబితాలోకి టెన్నిస్ సైతం చేరబోతుంది. ఇప్పటికే ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. డెవిస్ కప్ ఆసియా ఓసియాన గ్రూప్-1 పోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 14-15న ఇస్లామాబాద్లోని గ్రాస్కోర్టు కాంప్లెక్స్లో డెవిస్ కప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కాశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్లో డెవిస్ కప్ ఆడటం శ్రేయష్కరం కాదని భారత టెన్నిస్ సంఘం భావిస్తోంది. వేదిక మార్పు కోసం అంతర్జాతీయ టెన్నిస్ సంఘాన్ని కోరనుంది. దీనిపై పాకిస్థాన్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు సలీం సైఫుల్లా స్పందించారు. ' భారత జట్టు ఇస్లామాబాద్లో 4 రోజులు ఉంటుంది. వారి కోసం ఇక్కడి హౌటల్ నుంచి స్టేడియం వరకూ గట్టి భద్రత ఏర్పాటు చేశాం. భారత్ కోరుకుంటే, స్టేడియంలోకి అభిమానులను సైతం అనుమతించం. అత్యంత సురక్షిత ప్రదేశంలో డెవిస్ కప్ మ్యాచ్ జరుగనుంది. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదిక మార్పు ప్రస్తావన ఎందుకొస్తుంది? ఇస్లామాబాద్ డెవిస్కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది' అని సలీం వ్యాఖ్యానించారు.