Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా జట్టుకు నాల్గోస్థానంలో రిషబ్ పంత్ కంటే శ్రేయస్ అయ్యర్ బెటర్ అని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. నాల్గో స్థానం భర్తీకై రిషభ్ పంత్ను అక్కడ బ్యాటింగ్ పంపుతున్నామన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యల్ని గవాస్కర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా పంత్ను నాల్గో స్థానంలో బ్యాటింగ్కు దింపుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు... దాంతో అతని బ్యాటింగ్ ఆర్డర్ను మరింత కిందకు పంపాలని సూచించాడు. నాల్గో స్థానంలో పంత్ కంటే అయ్యర్ బెటర్ అని గవాస్కర్ కోరాడు. చాలాకాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని అయ్యర్ ఒడిసి పట్టుకున్నాడు. అతని ఆట తీరుతో ఎంతో విలువైన ఆటగాడో చాటిచెప్పాడు. ఇక అయ్యర్ రెగ్యులర్గా ఆటగాడిగా భారత్ క్రికెట్ జట్టులో ఉంటాడనే అనుకుంటున్నా. నాల్గో స్థానంలో అయ్యర్ను బ్యాటింగ్కు పంపి, పంత్ను ఐదు, ఆరు స్థానాల్లో పంపితే బాగుంటుంది. అయ్యర్ను నాల్గో స్థానంలో బ్యాటింగ్కు పంపితే జట్టు మరింత బలోపేతం అవుతుంది. విండీస్తో రెండో వన్డేలో ఐదోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్ 71 పరుగులతో మెరిశాడు. ఇక పంత్ నాల్గో స్థానంలో బ్యాటింగ్కు దిగి 20 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.