Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీసీ సమావేశంలో ప్రపంచ క్రికెట్ కమిటీ నిర్ణయం
లండన్: ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో కివీస్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ విసిరిన త్రో బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బంతి బౌండరీ చేరిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద ఓవర్త్రోపై సెప్టెంబర్లో సమీక్ష జరుపుతామని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వివాదాస్పద అంశాలపై ఎంసీసీ అధికారులు సోమవారం చర్చించారని సమాచారం. క్రికెట్ నిబంధన 19.8 ప్రకారం.. ఓవర్త్రోల నియమం సరిగ్గానే ఉందని, అయినా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో అనూహ్యంగా చోటు చేసుకున్న ఓవర్త్రోపై ప్రత్యేక కమిటీతో సెప్టెంబర్లో సమీక్ష జరుపుతామని ప్రపంచ క్రికెట్ కమిటీ వెల్లడించింది. ఎంసిసి ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్ మైక్ గ్యాటింగ్ అధ్యక్షతన ఆది, సోమవారం రెండు రోజుల పాటు వార్షిక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో టీమ్ ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ పాల్గొనాల్సి ఉన్నా.. వ్యక్తిగత కారణాల రిత్యా హాజరుకాలేదు.