Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28-26తో బెంగాల్ పైచేయి
- ప్రొ కబడ్డీ లీగ్ 7
అహ్మదాబాద్ : రెండు సార్లు ఫైనలిస్ట్, పీకెఎల్లో అత్యంత నిలకడగా రాణించే జట్టు గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ సీజన్ 7లో గతి తప్పింది. హ్యాట్రిక్ విజయాలతో ప్రొ కబడ్డీ లీగ్ 7ను మొదలెట్టిన గుజరాత్ తర్వాత వరుసగా ఐదు ఓటములు చవిచూసింది. బుధవారం బెంగాల్ వారియర్స్తో మ్యాచ్ను గుజరాత్ రెండు పాయింట్ల తేడాతో కోల్పోయింది. 26-28తో మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. 26-26తో సమవుజ్జీలుగా నిలిచిన సమయంలో చావోరేవో రైడ్లో గుజరాత్ రైడర్ సోను చతికిల పడగా.. బెంగాల్ చావోరేవో రైడ్లో వినోద్ కుమార్ అవుటయ్యాడు. దీంతో రెండు కీలక పాయింట్లు కోల్పోయిన గుజరాత్ ఓటమి కౌగిట్లోకి వెళ్లిపోయింది. విరామ సమయానికి 17-12తో ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ ద్వితీయార్థంలోనూ మెరిసింది. బెంగాల్ తరఫున ప్రపంజన్ (8), మహ్మద్ (5), మణిందర్ (5) రాణించారు. గుజరాత్ ఆటగాళ్లు సోను (8), సచిన్ (6), సునీల్ (6), పర్వేశ్ (2) పోరాడారు. మరో మ్యాచ్లో యూపీ యోధపై హర్యానా స్టీలర్స్ 36-33తో మూడు పాయింట్ల తేడాతో గెలుపొందింది. హర్యానా రైడర్ వికాశ్ 12 పాయింట్లతో సత్తా చాటాడు.