Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్-ఏతో టూర్ మ్యాచ్
సెయింట్ జాన్స్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్కు సిద్ధమవుతున్న టీమ్ ఇండియా అందుకోసం వెస్టిండీస్-ఏతో మూడు రోజుల టూర్ మ్యాచ్లో అస్త్రాలను పరీక్షించుకుంటోంది. పేలవ ఫామ్తో వన్డే జట్టులో చోటు కోల్పోయి, టెస్టు జట్టులో తుది జట్టులో స్థానం ప్రశ్నార్థకం చేసుకున్న అజింక్య రహానె విరామం తర్వాత ఆకట్టుకోలేకపోయాడు. వార్మప్ మ్యాచ్లో ఎదుర్కొన్న ఆరో బంతికే వికెట్ కోల్పోయాడు. ఒక్క పరుగే చేసిన రహానె నిరాశగా పెవిలియన్కు చేరాడు. టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (36), మయాంక్ అగర్వాల్ (12) తొలి వికెట్కు 36 పరుగులు జోడించారు. రాహుల్ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో రాణించినా వికెట్ కాపాడుకోలేదు. రెండు ఫోర్లు బాదిన అగర్వాల్ త్వరగా పెవిలియన్ బాట పట్డాడు. మూడో స్థానంలో వచ్చిన చతేశ్వర్ పుజార (22 నాటౌట్, 74 బంతుల్లో 2 ఫోర్లు), రోహిత్ శర్మ (38 నాటౌట్, 57 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆడుతున్నారు. 35 ఓవర్ల ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 111/3తో కొనసాగుతోంది.