Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్-ఏ 79/4
- మూడు రోజుల టూర్ మ్యాచ్
ఆంటిగ్వా : సుదీర్ఘ విరామం తర్వాత ఎర్ర బంతితో బరిలోకి దిగిన భారత సీనియర్ సీమర్ ఇషాంత్ శర్మ ఆంటిగ్వాలో అదరగొట్టాడు. తొలి స్పెల్లోనే రెండు వికెట్లు కూల్చి ఫామ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే ఓపెనర్ జెరెమీ (9)ను అవుట్ చేసిన ఇషాంత్, తొమ్మిదో ఓవర్లో బ్రెండన్ కింగ్ (4) భరతం పట్టాడు. ఇషాంత్ నిప్పులు చెరిగే బంతులతో వెస్టిండీస్-ఏ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. డారెన్ బ్రావో (11) ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో వికెట్ కోల్పోగా.. రవీంద్ర జడేజా కండ్లుచెదిరే ఫీల్డింగ్ నైపుణ్యంతో జేసన్ మహ్మద్ (6)ను రనౌట్ చేశాడు. దీంతో రెండో రోజు లంచ్ విరామ సమయానికి వెస్టిండీస్-ఏ 79/4తో (28 ఓవర్లు) కొనసాగుతోంది. ఓపెనర్ కవెం హౌడ్జె (45 నాటౌట్, 81 బంతుల్లో 7 ఫోర్లు), జోనాథన్ కార్టర్ (2 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు!.
వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో అంతకముందు టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ను 297/5 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార (100, 187 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగగా, రోహిత్ శర్మ (68, 115 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) తొలి టెస్టు తుది జట్టులో నిలిచే ఇన్నింగ్స్ ఆడాడు. హనుమ విహారి (37 నాటౌట్), రిషబ్ పంత్ (33) రాణించారు. ఓవర్నైట్ స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లి డిక్లరేషన్ ప్రకటించగా, రెండో రోజు వర్షం ఆగిన తర్వాత వెస్టిండీస్-ఏ బ్యాటింగ్కు వచ్చింది.