Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ స్పాన్సర్ పేటీఎం బిడ్
- మరో ఐదేండ్లకు హక్కులు సొంతం
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయం రెట్టింపవుతోంది!. 2019-23 ఐదేండ్ల కాలానికి బీసీసీఐ టైటిల్ హక్కులను రూ. 326.80 కోట్లకు అప్పగించింది. వన్97 కమ్యూనికేషన్స్ యజమాన్యంలోని పేటీఎం (పేమెంట్స్ వాలెట్) ఈ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నాలుగేండ్ల కాలానికి 2015లో పేటీఎం మ్యాచ్కు రూ. 2.4 కోట్లకు దక్కించుకోగా.. రానున్న ఐదేండ్ల కాలానికి ఇది 58 శాతం పెరిగింది. భారత్లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచులకు పేటీఎం టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ' బీసీసీఐ, భారత క్రికెట్ జట్టుతో దీర్ఘకాలిక బంధం కొనసాగించటంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాం. ప్రతి సీజన్కు భారత క్రికెట్ బలోపేతం కావాలని మా అభిలాష. భారత్ క్రికెట్ను ప్రేమిస్తుంది, పేటీఎం దానికి వీరాభిమాని' అని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజరు శంకర్ శర్మ పేర్కొన్నాడు.