Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో మహిళల టీ20లకు
ముంబయి : దక్షిణాఫ్రికాతో మహిళల టీ20ల్లో తలపడే భారతజట్టును బిసిసిఐ గురువారం ప్రకటించింది. టీ20లకు సీనియర్ బ్యాట్స్వుమెన్ మిథాలీరాజ్ గుడ్బై చెప్పడంతో 15 ఏళ్ల షెఫాలీ వర్మ అనూహ్యంగా చోటు దక్కించుకుంది. ఇండియన్ ప్రిమియర్లీగ్ మహిళల టీ20 ఛాలెంజ్లో మిథాలీ సారథ్యంలోనే ఆడిన షెఫాలీ... దేశవాళీ టోర్నీల్లోనూ దుమ్ము రేపుతోంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీస్లో మూడు మ్యాచ్లకు షెఫాలీని ఎంపిక చేశారు. దీంతో మహిళల క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రెండో అతి పిన్నవయస్కురాలిగా షెఫాలీ నిలిచింది. అంతకుముందు గ్రెయిర్ బెనర్జీ 14 ఏళ్ల 165 రోజులకే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. జెమీమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్లో తిరిగి టీ20ల్లో పునరాగమనం చేశారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి... వన్డే సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.