Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనీస్ తైపే బ్యాడ్మింటన్ టోర్నీ
తైపే : మాజీ ఛాంపియన్ సౌరభ్ వర్మ చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. గురువారం నుండి ప్రారంభమైన టోర్నీలో భాగంగా జరిగిన తొలిరౌండ్ పోటీలో సౌరభ్ 12-21, 10-21తో ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండోస్థానంలో ఉన్న ఛో-టిన్-చెన్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఈ మ్యాచ్ను కేవలం 30 నిమిషాల్లోనే సౌరభ్ ఓటమి చవిచూడడం విశేషం. తొలిగేమ్లో ముందే 11-5 ఆధిక్యతను ప్రత్యర్ధికి కోల్పోయిన సౌరభ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయాడు. రెండో గేమ్లోనూ 11-4 ఆధిక్యతను ప్రత్యర్ధి సాధించడంతో మరి కోలుకోలేదు. 26ఏళ్ల సౌరభ్ గత నెలలో హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 38వ స్థానంలో ఉన్న సౌరభ్ ఏ దశలోనూ టాప్ ప్లేయర్కు పోటీగా నిలవలేకపోయాడు. 2016లో టోర్నీ విజేతగా ఉన్న సౌరభ్ అంతకుముందు 2014 మలేషియా గ్రాండ్ప్రిక్స్ టోర్నీలోనూ ఛో-టిన్ చేతిలో ఓడాడు.