Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. బీసీిసీిఐ అనుమతి లేకుండా కరేబియన్ ప్రిమియర్లీగ్( సీసీఎల్)లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నందుకు అతడికి ఈ నోటీసులు జారీచేసింది. ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు, సీసీఎల్లోని ట్రిన్బాగో నైట్రైడర్స్కు బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ యజమాని. కరేబియన్ లీగ్లో ఆ ఫ్రాంచేజీ జెర్సీ వేసుకొని డ్రెస్సింగ్ రూమ్లో కనిపించినట్లు బి సీసీఐ దీనేష్ను సంజాయిషీ కోరింది.. దీంతో అతనిపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటున్నట్టు బీ సీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ నోటీసులు పంపించారు.