Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి, రోహిత్ బంధంపై శాస్త్రి
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు నాయకత్వంలో విభేదాలు నెలకొన్నాయనే వార్తలను కరీబియన్ పర్యటనకు బయల్దేరే ముందే కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై తాజాగా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వివరణాత్మక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నడుమ భిన్న అభిప్రాయాలను విభేదాలుగా చూడవద్దని చెప్పాడు. ' భారత జట్టులో 15 మంది సభ్యులు. అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని నేను కోరుకోను. టీమ్ ఇండియా డ్రెస్సింగ్రూమ్లో ఐదేండ్లుగా ఉంటున్నాను. విరాట్, రోహిత్ జట్టు కోసం ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఒక్కోసారి జట్టులోని యువ ఆటగాడు నూతన వ్యూహంతో ముందుకొస్తాడు. అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత, ఆచరణలోకి ఓ వ్యూహం ఎంచుకుంటాం. భిన్న అభిప్రాయాలను విభేదాలుగా చూపించటం హాస్యాస్పదం' అని రవిశాస్త్రి అన్నాడు. విభేదాలు నిజమే అయితే ప్రపంచకప్లో రోహిత్ ఐదు సెంచరీలు.. రోహిత్తో కలిసి కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పటం సహా కరీబియన్ పర్యటనలో క్లీన్ స్వీప్ విజయాలు సాధ్యపడ తాయా? అని శాస్త్రి ప్రశ్నించాడు.