Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2013 తర్వాత తొలిసారి టెస్టుల్లో ఓపెనర్గా అవకాశం దక్కించుకోనున్న స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు ఆ దిశగా సెలక్షన్ కమిటీ ఓ సన్నాహక అవకాశం అందించింది. అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నంలో తొలి టెస్టు ఆరంభం కానుంది. అంతకముందే విజయనగరంలో దక్షిణాఫ్రికాతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో తలపడే బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుకు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ నాయకత్వ పగ్గాలు సైతం రోహిత్ శర్మకు అప్పగించింది ఎమ్మెస్కే బృందం. సెప్టెంబర్ 26, 27, 28లలో వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. సఫారీ పేసర్లను ఆరంభంలోనే ఎదుర్కొనేందుకు రోహిత్ శర్మకు వార్మప్ మ్యాచ్లో ఓ సదవకాశం లభించనుంది.
బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, ఏఆర్ ఈశ్వరన్, కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, ధర్మేంద్రసిన్హా జడేజా, అవేశ్ ఖాన్, ఇషన్ పోరెల్, షార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.