Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజరుహజారేకు హైదరాబాద్ జట్టు
నవతెలంగాణ, హైదరాబాద్ : 2019 ప్రపంచకప్కు ఎంపిక చేయనందున, భావోద్వేగ రిటైర్మెంట్ ప్రకటించి తిరిగి బ్యాట్ పట్టేందుకు సిద్ధమైన తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు విజరు హజారే వన్డే టోర్నీలో ఆడనున్నాడు. సెప్టెంబర్ 24 నుంచి బెంగళూర్లో జరుగనున్న దేశవాళీ వన్డే టోర్నీ విజరు హజారేలో పాల్గొనే హైదరాబాద్ జట్టును హెచ్సీఏ శుక్రవారం ప్రకటించింది. వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్న అంబటి రాయుడు హైదరాబాద్కు నాయకత్వం వహించనున్నాడు. పేసర్ మహ్మద్ సిరాజ్, సి.వి మిలింద్లు హైదరాబాద్ తరఫున ఆడనున్నారు. బి. సందీప్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
హైదరాబాద్ వన్డే జట్టు : అంబటి రాయుడు (కెప్టెన్), బి. సందీప్ (వైస్ కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మరు అగర్వాల్, ఠాకూర్ తిలక్ వర్మ, రోహిత్ రాయుడు, సి.వి మిలింద్, మెహిది హసన్, సాకెత్ సాయిరాం, మహ్మద్ సిరాజ్, మికిల్ జైశ్వాల్, జె. మల్లికార్జున (వికెట్ కీపర్), కార్తీకేయ, టి. రవితేజ, అజరు దేవ్ గౌడ్. ( విక్రమ్ నాయక్, తనరు త్యాగరాజన్, అభిరాత్ రెడ్డి, ప్రణీత్ రాజ్, రాక్షణ్ రెడ్డి స్టాండ్బైలు ఎంపికయ్యారు)