Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు పతకాలు ఖాయం
- వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్స్
ఎకతరిన్బర్గ్ (రష్యా)
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్స్లో భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకుంది. పురుషుల 52 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, 63 కేజీల విభాగంలో మనీశ్ కౌశిక్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. వరల్డ్ చాంపియన్షిప్స్లో కనీసం రెండు కాంస్య పతకాలు ఖాయం చేశారు. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్షిప్స్ విజేత అమిత్ పంగాల్ క్వార్టర్ఫైనల్లో ఫిలిప్పీన్స్ బాక్సర్ కార్టో పాలమ్పై 4-1తో గెలుపొందాడు. మనీశ్ కౌశిక్ 5-0తో బ్రెజిల్ బాక్సర్ వాండర్సన్ డీ ఒలివీరను చిత్తుగా ఓడించాడు. అమిత్, మనీశ్లకు ప్రపంచ చాంపియన్షిప్స్లో ఇదే తొలి మెడల్ ప్రదర్శన కావటం గమనార్హం. 91 కేజీల విభాగంలో సంజీత్ 1-4తో ఈక్వెడార్ బాక్సర్కు సెమీస్ బెర్త్ను కోల్పోయాడు. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత్ గతంలో ఎన్నడూ ఒకేసారి రెండు పతకాలు సాధించలేదు. ఈ సారి భారత్ రెండు పతకాలతో కొత్త రికార్డు నెలకొల్పింది. విజేందర్ సింగ్ (2009), వికాశ్ క్రిషన్ (2011), శివ థాప (2015), గౌరవ్ బిండురి (2017)లలో భారత్కు వరల్డ్ బాక్సింగ్ మెడల్స్ సాధించారు.