Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో మూడో టీ20 నేడు
- వరుస విజయంపై భారత్ ధీమా
- సమంపై సఫారీ సేన గురి
- రాత్రి 7 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
మ్యాచ్కు ముందు తుది జట్టు కూర్పు తీరుతెన్నులపై టీమ్ ఇండియా ఎన్నడూ స్పష్టత ఇవ్వదు. సహజంగా గెలుపు బాటలో సాగుతున్న వేళ తుది జట్టును మార్చేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నం. కోహ్లిసేన 2020 టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతోంది. బ్యాటింగ్ లైనప్లో మిడిల్ ఆర్డర్ బలోపేతం జట్టు ముందున్న లక్ష్యం. దీంతో చిన్నస్వామిలో ప్రయోగాలు చేసేందుకు భారత్ రెఢ అయ్యే అవకాశం ఉంది. మరో సిరీస్ విజయంపై భారత్ కన్నేయగా, సిరీస్ను నిలుపు కోవటంపై సఫారీ ఆరాటపడుతోంది.
నవతెలంగాణ-బెంగళూర్
చిన్న సమరం చిన్నస్వామికి చేరుకుంది. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ విజయం కోసం నేడు టీమ్ ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. చంఢగీడ్లో అలవోక విజయం సాధించిన కోహ్లిసేన నేడు బెంగళూర్లో అదే ఆధిపత్యం పునరావృతం చేయాలని చూస్తోంది. వెస్టిండీస్పై పొట్టి సిరీస్ సాధించిన భారత్, తాజాగా సఫారీపైనా సిరీస్ విజయంపై కన్నేసింది. ప్రత్యర్థి శిబిరం నుంచి మొహాలీలో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. భారత్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది. చిన్నస్వామిలో కథ వేరుగా ఉండాలని దక్షిణాఫ్రికా భావిస్తుంది. కెప్టెన్గా తొలి గెలుపు రుచి చూసేందుకు క్వింటన్ డికాక్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 పోరు నేడు.
మిడిల్పైనే ఫోకస్ : 2020 టీ20 ప్రపంచకప్ సన్నద్ధతలో భారత్ బలంగానే కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మెరుగ్గా ఉంది. టాప్ ఆర్డర్లో టాప్-3పై ఎటువంటి బెంగ అక్కర్లేదు. కానీ నం.4 నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. వన్డే వరల్డ్కప్లో భారత్ను నం.4 స్పెషలిస్ట్ కొరత వేధిం చింది. ఇప్పుడూ అది కొనసాగుతుంది. యువ బ్యాట్స్ మన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం నం.4లో ఆడుతున్నాడు. కానీ గత పది టీ20 ఇన్నింగ్స్ల్లో ఏడు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితయ్యాడు పంత్. దీంతో అక్కడ శ్రేయాష్ అయ్యర్ను ప్రయోగించే ఆలో చన టీమ్ మేనేజ్మెంట్ వద్ద ఉంది. రిషబ్ పంత్ను లోయర్ ఆర్డర్కు తీసుకొస్తే, అతడిపై ఒత్తిడి సైతం తగ్గుతుంది. స్వేచ్ఛగా ఆడుకుంటాడనే భావన. టాప్ ఆర్డర్ నిలకడగా రాణించటంతో మిడిల్ ఆర్డర్కు అవకా శాలు సైతం తక్కువగా వస్తున్నాయి. స్పిన్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్య మొహాలీలో ఒకే ఓవర్ వేశాడు. నేడు అతడి స్థానంలో రాహుల్ చాహర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనిలలో ఒకరు బెంచ్ కు పరిమితం కావచ్చు. వాషింగ్టన్ సుందర్ టీ20ల్లో పవర్ ప్లే స్పిన్నర్గా అమోఘంగా రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా తోడుగా అతడు జట్టులో కొనసా గవచ్చు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలపైనే బ్యాటింగ్ భారం ఉంది. కెఎల్ రాహుల్ మరోసారి బెంచ్కు పరిమితం కానున్నాడు.
సమంపై సఫారీ దృష్టి : యువ నాయకుడు క్వింటన్ డికాక్కు భారత్పై తిరుగులేని రికార్డుంది. ఐపీఎల్లో చిన్నస్వామి స్టేడియంలో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు కొట్టాడు. రెండో టీ20లో అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. తెంబ బవుమా మంచి ఫామ్లో ఉన్నాడు. డెవిడ్ మిల్లర్, హెండ్రిక్స్లు సైతం తోడైతే దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో జూనియర్ డాలను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. టీ20ల్లో డాల మూడుసార్లు రోహిత్ శర్మను అవుట్ చేశాడు. మొహాలీలో మెరుగైన ఆరంభం లభించినా, సఫారీ సద్వినియోగం చేసుకోలేదు. చిన్నస్వామిలో ఆ పొరపాటు పునరావృతం కాకుండా ఉంటే, సఫారీ కోహ్లిసేనకు గట్టి పోటీనివ్వనుంది.
పిచ్ రిపోర్టు : చిన్నస్వామిలో బౌండరీలు బాగా చిన్నవి. పేసర్లకు పెద్దగా సహకారం లభించదు. బంతి సులువుగా బ్యాట్పైకి రావటంతో బాదేందుకు అనువుగా ఉంటుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 180. ఆరు మ్యాచుల్లో నాలుగింట ఛేదించిన జట్టును విజయం వరించింది. చిన్న బౌండరీలు స్పిన్నర్లకు సవాల్ విసిరినా, ఇక్కడ టర్న్కు మెరుగైన సహకారం ఉంటుంది.
తుది జట్లు (అంచనా) : భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, శ్రేయాష్ అయ్యర్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య /రాహుల్ చాహర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ సైని.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, వాన్డర్ డుసెన్, తెంబ బవుమా, డెవిడ్ మిల్లర్, ఫెలుక్వయో, ప్రిటోరియస్, ఫోర్టిన్, కగిసో రబాడ, జూనియర్ డాల, షంషి.