Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అప్పటి వరకు ధోని విరామం?
న్యూఢిల్లీ : ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోని మళ్లీ మైదానంలో కనిపించలేదు. 38 ఏండ్ల మహేంద్రుడు క్రికెట్కు గుడ్ బై చెబుతున్నాడనే వార్తలు నిత్యం షికారు చేస్తున్నా.. వరల్డ్కప్ తర్వాత సైనిక విధుల్లో కొనసాగిన ధోని.. ఇప్పుడు కుటుంబ సెలవులో కొనసాగుతున్నాడు. వరల్డ్కప్ తర్వాత కరీబియన్ పర్యటనకు దూరమైన ధోని.. తాజాగా స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్కూ అందుబాటులో లేడు. డిసెంబర్లో వెస్టిండీస్ జట్టు తిరిగి భారత్కు రానుంది. మూడు వన్డేలు, మూడు టీ20 ఆడనుంది. కరీబియన్లతో సిరీస్ సమయానికి మహి సెలక్షన్కు అందుబాటులో ఉంటాడని ఓ పత్రిక కథనం రాసింది. దేశవాళీ విజరు హజారే ట్రోఫికి సైతం మహి అందుబాటులో ఉండబోడని సమాచారం.